నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 13:56

రేపు పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌

పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య గురువారంసాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నగరంలోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకీతో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మేడ్చల్‌, నల్లగొండ, వరంగల్‌లోని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో సేవలు పొందొచ్చని చెప్పారు.

www.passport.gov.inలో దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేసుకోవాలని చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 16:19

వార్డు సమస్యలపై పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
Streetbuzz News Real time News platform

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 14:51

Cm Jagan: పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి వ్యక్తిగత విమర్శలు..

కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి తన స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

''చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 - 4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్‌..

ఇంకోసారి నేషనల్‌.. మరోసారి ఇంటర్నేషనల్‌. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా.. పవన్‌కు గౌరవం లేదు'' అని జగన్‌ వ్యాఖ్యానించారు..

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 14:49

దారుణం.. కుటుంబ కలహాలతో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది గుండ్ల సింగారంలో ఓ కానిస్టేబుల్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకి శబ్ధం విన్న స్థానికులు కానిస్టేబుల్పై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు..

ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

ఆర్థిక లావాదేవీలతో తలెత్తిన విభేదాల కారణంగా ఓ కానిస్టేబుల్‌ తన అత్తను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో చోటు చేసుకుంది. మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా భార్యాపిల్లలు పుట్టింటి వద్దే ఉంటుండగా… ఉదయం ప్రసాద్‌ గుండ్లసింగారం వచ్చాడు.

అత్త కమలమ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఎవరూ లేనిది చూసి.. సర్వీస్ రివాల్వర్‌తో ఆమె ఛాతిపైపై కాల్పులు జరిపారు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. తుపాకీ శబ్దం విని అక్కడికి పరుగులు తీసిన స్థానికులు.. ప్రసాద్‌పై రాళ్లతో దాడి చేసి, తరిమికొట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కమలమ్మ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్త, అల్లుడికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం నెలకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 14:47

సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయింది. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చింది. అయినా.. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముందు ఆందోళనలకు దిగుతున్నారు.

నాగర్ కర్నూల్‌లో నాగం జనార్ధన్ రెడ్డికే టికెట్ కేటాయించాలంటూ మంగళవారం గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు టీపీసీసీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దానికి తోడు టికెట్ల విషయమై సీనియర్ల మధ్య కూడా పొరపచ్చాలు వచ్చినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం

తెలంగాణ అసెంబ్లీ సీట్ల సర్ధుబాటు, అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన నేతృత్వంలో ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతలను హైకమాండ్ ఈ ఫోర్ మెన్ కమిటీకి అప్పగించింది.

సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టింది. జానారెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్‌లతో ఈ కమిటీని నియమించింది.

ఇవాళ గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించకుండా సీట్లు ప్రకటిస్తే నేతల్లో అసంతృప్తి పెరిగి ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

దీంతో అభ్యర్థుల ప్రకటన ముందే జానారెడ్డి ద్వారా అసంతృప్తి చల్లార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది...

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 09:58

రేపటి నుంచే దసరా సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్,SA1,నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి.

ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభం అయిన తరువాత ప్రకటిస్తారు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారికి ఈ సెలవులు ఉంటాయి.

ఆ తరువాత రోజు నుంచి యధావిధిగా తరగతులు ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది..

నిజంనిప్పులాంటిది

Oct 10 2023, 11:54

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో ఊరట

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది.

ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దానిని మంగళవారం కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు..

నిజంనిప్పులాంటిది

Oct 10 2023, 10:08

ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంక పాకిస్తాన్ నేడు కీలక పోరు

వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది.

లంక ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు నెదర్లాండ్స్‌తో ఉప్పల్‌లోనే జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాదించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా సోమవారం ముమ్మర సాధన చేశాయి. తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన లంక ఈసారి మాత్రం విజయమే లక్షంగా పెట్టుకుంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో లంకను కలవరానికి గురిచేస్తోంది.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో రజిత, మధుశంకా, పతిరణ, వెల్లలాగే తదితరులు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం లంక కాస్త పర్వాలేదనిపించింది. కుశాల్ మెండిస్ 42 బంతుల్లోనే 76 పరుగులు చేయడం జట్టుకు కలిసి వచ్చే అంశమే.

అసలంక, కెప్టెన్ శనక కూడా బ్యాట్‌ను ఝులిపించారు. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు.

ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు విఫలమయ్యారు. కానీ వికెట్ కీపర్ రిజ్వాన్, సౌద్ షకిల్, నవాజ్, షాదాబ్‌లు ధాటిగా ఆడడం పాక్‌కు ఊరటనిచ్చే అంశమే. బౌలింగ్‌లో పాక్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాక్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది...